ETV Bharat / business

ప్రభుత్వ బ్యాంకుల సీఈఓలతో నిర్మల భేటీ వాయిదా

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. త్వరలోనే సమావేశానికి కొత్త తేదీని ప్రకటించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

author img

By

Published : May 11, 2020, 12:01 PM IST

fm-meeting-with-heads-of-public-sector-banks-gets-deferred
నిర్మలా సీతారామన్

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగాల్సిన ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశం కోసం కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడమే ముఖ్య అజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రుణ చెల్లింపులపై బ్యాంకులు విధించిన 3 నెలల మారటోరియం సహా దీర్ఘకాలిక రుణాల పురోగతిని సైతం ఈ భేటీలో సమీక్షించాలని నిర్ణయించారు. అయితే ఈ భేటీ వాయిదాకు గల కారణాలు తెలియలేదు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరగాల్సిన ఈ భేటీని వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశం కోసం కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

కరోనా సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడమే ముఖ్య అజెండాగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రుణ చెల్లింపులపై బ్యాంకులు విధించిన 3 నెలల మారటోరియం సహా దీర్ఘకాలిక రుణాల పురోగతిని సైతం ఈ భేటీలో సమీక్షించాలని నిర్ణయించారు. అయితే ఈ భేటీ వాయిదాకు గల కారణాలు తెలియలేదు.

ఇదీ చదవండి: ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓలతో నేడు నిర్మల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.