ETV Bharat / bharat

ప్రేమకు నో చెప్పిందని పగ.. ఇంటికెళ్లి దారుణంగా గొంతు కోసి హత్య

author img

By

Published : Oct 23, 2022, 10:32 AM IST

ప్రేమిస్తే కాదన్నదని ఓ యువతిపై కక్ష కట్టాడు ఆ యువకుడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఆమె గొంతు కోసి పరారయ్యాడు. మరోవైపు చిన్నారి​ అనే కనికరం లేకుండా ఓ పండు ముసలి వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

youth murdered girl in kannur
youth killed girl in kerala

తన ప్రేమను కాదన్నదని 23 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని కన్నూర్​లో జరిగింది. కుటుంబసభ్యులు సమచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కన్నూర్​కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్​జిత్​ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు. నిరాకరించిన ఆ యువతిని హత్య చేయాలనుకున్నాడు. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆమెను ఓ కంట కనిపెట్టాడు. కాసేపటికే ఆ యువతి డ్రెస్​ మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు.

ఇంటికి వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి అనుమానంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి షాక్​కు గురయ్యారు. ఆమె మెడతో పాటు చేతిపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని దర్యాప్తులో తేలింది. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్​ వేసుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.

మైనర్​పై అరవై ఏళ్ల వృద్ధుని దారుణం..
మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ అరవై ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ త్రిలోక్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మద్వా ప్రతాప్​పూర్​లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వృద్ధుడు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి బయటపడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: కాలువలో పడి ఐదుగురు బాలికలు మృతి.. మట్టి కోసం వెళ్లగా ప్రమాదం

అరుణాచల్ హెలికాప్టర్ క్రాష్​పై విచారణ.. ఘటనకు ముందు ఏం జరిగిందంటే?

తన ప్రేమను కాదన్నదని 23 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కేరళలోని కన్నూర్​లో జరిగింది. కుటుంబసభ్యులు సమచారంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కన్నూర్​కు చెందిన విష్ణుప్రియ అనే యువతిని కూతుపరంబాకి చెందిన శ్యామ్​జిత్​ అనే వ్యక్తి ప్రేమించమని ఒత్తిడి చేశాడు. నిరాకరించిన ఆ యువతిని హత్య చేయాలనుకున్నాడు. సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో వెళ్లిన ఆమెను ఓ కంట కనిపెట్టాడు. కాసేపటికే ఆ యువతి డ్రెస్​ మార్చుకునేందుకు ఇంటికి వచ్చింది. ఆమె ఒంటరిగా ఉందని తెలుసుకున్న నిందితుడు.. ఇంట్లోకి చొరబడి ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు.

ఇంటికి వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి అనుమానంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి షాక్​కు గురయ్యారు. ఆమె మెడతో పాటు చేతిపైన కత్తితో పొడిచిన గాయాలున్నాయని దర్యాప్తులో తేలింది. ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్​ వేసుకున్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తును ప్రారంభించారు.

మైనర్​పై అరవై ఏళ్ల వృద్ధుని దారుణం..
మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఓ అరవై ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ త్రిలోక్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మద్వా ప్రతాప్​పూర్​లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. వృద్ధుడు ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో ఒకటి బయటపడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: కాలువలో పడి ఐదుగురు బాలికలు మృతి.. మట్టి కోసం వెళ్లగా ప్రమాదం

అరుణాచల్ హెలికాప్టర్ క్రాష్​పై విచారణ.. ఘటనకు ముందు ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.