మహారాష్ట్ర హింగోలీలోని కపడసింగి గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఆరు నెలల చిన్నారిని దేవతగా భావించి పూజలు చేస్తున్నారు భక్తులు. స్థానికంగా ఉండే భక్తులతో పాటు విదేశాల నుంచి శిశువు చూసేందుకు తరలివస్తున్నారు.
ఆరు నెలల క్రితం కపడసింగి తండాలో సుభాశ్ అనే వ్యక్తికి జన్మించిన బాలిక నుదుటి భాగంలో ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉండేవి. అవి వయసుతోపాటే పెరిగి.. కుంకుమ రంగులోకి మారిపోయాయి. ప్రస్తుతం చిన్నారి నుదిటి మొత్తం కుంకుమ రంగు వ్యాపించడం వల్ల.. ఆ పాపను అమ్మవారిగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు భక్తులు. చిన్నారిని చూసేందుకు మహిళా భక్తులు భారీగా తరలివస్తున్నారు.
![six month old girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-hin-kapad-singi_09092022063621_0909f_1662685581_873.png)
![six month old girl worshiped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16326773_kk.jpg)
ఇవీ చదవండి: 'మిస్త్రీ యాక్సిడెంట్కు 5 సెకన్ల ముందు అలా..'.. బెంజ్ కంపెనీ కీలక నివేదిక