ETV Bharat / bharat

షూ సోల్ కట్ చేసి గ్యాస్ బాంబులు ఫిక్స్- పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు

author img

By PTI

Published : Dec 15, 2023, 5:37 PM IST

Parliament Security Breach Case : పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌ను కట్‌ చేసి అందులో గ్యాస్‌ క్యానిస్టర్లను అమర్చి లోక్‌సభ లోపలకు తీసుకెళ్లినట్లు పోలీసులు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్నారు. మరోవైపు, నిందితుడు లలిత్ ఝాను దిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడికి 7 రోజుల పోలీస్ కస్టడీని విధించింది కోర్టు.

Parliament Security Breach Case
Parliament Security Breach Case

Parliament Security Breach Case : దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి నిందితులు కలర్‌ గ్యాస్‌ లోపలికి ఎలా తీసుకెళ్లారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నిందితులు వీటిని లోపలకు ఎలా తీసుకెళ్లారో పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌ను కట్‌ చేసి అందులో ఈ గ్యాస్‌ క్యానిస్టర్లను అమర్చి లోక్‌సభ లోపలకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిందితులు లఖ్‌నవూలో ప్రత్యేక స్పోర్ట్స్‌ బూట్లు, ముంబయిలో గ్యాస్‌ క్యాన్లను కొనుగోలు చేశారు. ఇద్దరు నిందితులు స్పోర్ట్స్ షూ ఎడమ అరికాళ్ల వద్ద మందంగా ఉండే షూ సోల్‌ను కట్‌ చేశారు. అనంతరం ఆ ఖాళీలో గ్యాస్‌ క్యానిస్టర్లను అమర్చి మళ్లీ రబ్బర్‌ను అతికించారు. కుడి కాలు షూను కూడా కత్తిరించినా అందులో ఎలాంటి వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం చెకింగ్‌కు దొరకకుండా లోక్‌సభలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు అదును చూసుకుని లోక్‌సభలోకి దూకారు. అనంతరం షూల నుంచి గ్యాస్‌ కెనాన్లను బయటకు తీసి పొగ వచ్చేలా చేశారు.

లోక్‌సభలో నిందితులు వాడిన గ్యాస్‌ క్యానిస్టర్లను డోర్లు మూసి ఉన్న ప్రదేశాల్లో వినియోగించకూడదని, వాడేముందు కళ్లజోడు, గ్లౌజులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లోక్‌సభలో అలజడి రేపిన మనోరంజన్‌, సాగర్‌ శర్మ నుంచి కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలోకి తీసుకువెళ్లిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం, హిందీ, ఇంగ్లీష్‌లో నినాదాలు ఉన్నాయని వెల్లడించారు.

'లలిత్ ఝాకు వారం రోజుల రిమాండ్'
మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో కీలక నిందితుడైన లలిత్ ఝాను పోలీసులు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో కీలక సూత్రదారి అని, అతడిని 15 రోజుల పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. దిల్లీ కోర్టు జడ్జి హర్దీప్ కౌర్ నిందితుడు లలిత్ ఝాకు వారం రోజులపాటు పోలీసు కస్టడీ విధించారు. గురువారం పార్లమెంట్​లో అలజడి కేసులో మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవికి ఇప్పటికే వారం రోజుల కస్టడీ విధించింది కోర్టు.

'చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా'
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో లలిత్ ఝా ఉండడంపై అతడి సోదరుడు శంభు ఝా స్పందించారు. తన సోదరుడు ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నాడో తమకు తెలియదని అన్నారు. అతడు చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉండేవాడని చెప్పారు. టీవీ ఛానల్​లో నిందితుడిగా లలిత్ ఝా ఫొటోలను చూసి కుటుంట సభ్యులు ఆశ్చర్యపోయామని తెలిపారు.

దద్దరిల్లిన ఉభయసభలు- సోమవారానికి వాయిదా
లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యతగా కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ఆగంతకులను పాసులు జారీచేసిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విపక్ష ఎంపీల నినాదాలతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలగడం వల్ల స్పీకర్‌ ఓం బిర్లా స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సభను తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల సభ సోమవారానికి వాయిదా పడింది.

అటు రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశంకాగానే భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీశ్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. దీంతో విపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుపట్టడం సహా టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం వల్ల ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు.

సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల మౌనదీక్ష
సస్పెన్షన్ వేటు పడిన విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపీలు పార్లమెంటు భవన ద్వారం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ వారిని కలిశారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని ఉభయసభల్లో ఆందోళన చేసినందుకు లోక్‌సభకు చెందిన 13మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్‌ విధించారు.

'అమిత్ షాపై కాంగ్రెస్ ఫైర్​'
లోక్​సభలో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన ఇవ్వకుండా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రశ్నలు అడిగిన ఎంపీలను చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉభయసభలకు హాజరై ప్రకటన చేయనంతవరకు పార్లమెంటు సమావేశాలు సాగే అవకాశం లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నేతలు ఈ విషయాన్ని ఛైర్మన్ జగదీశ్‌ ధన్‌ఖడ్‌కు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఉభయసభలకు హాజరై ఓ ప్రకటన చేయాలని ఆ తర్వాత సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అంతవరకు సభలు సాగే అవకాశమే లేదని జైరాం రమేశ్ స్పష్టంచేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయని ఆయన గుర్తు చేశారు.

  • #WATCH | Delhi: On the adjournment of Parliament, Congress leader Jairam Ramesh says, "Until the Home Minister comes in both the Houses of the Parliament and makes a statement, there are very few possibilities that the Parliament would run. There are still 4 days left (of the… pic.twitter.com/nGmV9m47HX

    — ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'విపక్షాలు సభకు హాజరవ్వాలి'
పార్లమెంటులో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చ జరపటం సహా హోం మంత్రి ప్రకటన చేసే వరకు సమావేశాలను జరగనివ్వబోమని ప్రతిపక్షాలు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణను మీడియా ప్రతినిధులు ప్రహ్లాద్‌ జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. ఎవరూ మరొకరి గొంతు నొక్కే ప్రయత్నం చేయటం లేదని, అది వారి అభిప్రాయం కావచ్చని సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు సభకు హాజరై చర్చలో పాల్గొనాలని ప్రహ్లాద్‌ జోషి సూచించారు. సోమవారం పాత నేరచట్టాల స్థానంలో తెచ్చిన 3కొత్త బిల్లులపై విస్తృత చర్చ జరగనుందని, అందుకోసం 15గంటల సమయం కేటాయించినట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

కోర్టులోనే మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు!- రంగంలోకి సీజేఐ- నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

దేశంలోనే అతిపెద్దదిగా, తాజ్​మహల్​కన్నా అందంగా అయోధ్య మసీదు- మక్కా ఇమామ్​తో శంకుస్థాపన

Parliament Security Breach Case : దేశ ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్‌లో అలజడి రేపిన ఘటనలో కీలక విషయాలు బహిర్గతమవుతున్నాయి. మూడంచెల భద్రతా వ్యవస్థను దాటి నిందితులు కలర్‌ గ్యాస్‌ లోపలికి ఎలా తీసుకెళ్లారన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. నిందితులు వీటిని లోపలకు ఎలా తీసుకెళ్లారో పోలీసులు FIRలో పేర్కొన్నారు. నిందితులు బూట్ల కింద ఉండే సోల్‌ను కట్‌ చేసి అందులో ఈ గ్యాస్‌ క్యానిస్టర్లను అమర్చి లోక్‌సభ లోపలకు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిందితులు లఖ్‌నవూలో ప్రత్యేక స్పోర్ట్స్‌ బూట్లు, ముంబయిలో గ్యాస్‌ క్యాన్లను కొనుగోలు చేశారు. ఇద్దరు నిందితులు స్పోర్ట్స్ షూ ఎడమ అరికాళ్ల వద్ద మందంగా ఉండే షూ సోల్‌ను కట్‌ చేశారు. అనంతరం ఆ ఖాళీలో గ్యాస్‌ క్యానిస్టర్లను అమర్చి మళ్లీ రబ్బర్‌ను అతికించారు. కుడి కాలు షూను కూడా కత్తిరించినా అందులో ఎలాంటి వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. అనంతరం చెకింగ్‌కు దొరకకుండా లోక్‌సభలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు అదును చూసుకుని లోక్‌సభలోకి దూకారు. అనంతరం షూల నుంచి గ్యాస్‌ కెనాన్లను బయటకు తీసి పొగ వచ్చేలా చేశారు.

లోక్‌సభలో నిందితులు వాడిన గ్యాస్‌ క్యానిస్టర్లను డోర్లు మూసి ఉన్న ప్రదేశాల్లో వినియోగించకూడదని, వాడేముందు కళ్లజోడు, గ్లౌజులు ధరించాలన్న నిబంధనలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లోక్‌సభలో అలజడి రేపిన మనోరంజన్‌, సాగర్‌ శర్మ నుంచి కరపత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. లోక్‌సభలోకి తీసుకువెళ్లిన కరపత్రాలలో త్రివర్ణ పతాకం, హిందీ, ఇంగ్లీష్‌లో నినాదాలు ఉన్నాయని వెల్లడించారు.

'లలిత్ ఝాకు వారం రోజుల రిమాండ్'
మరోవైపు, పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో కీలక నిందితుడైన లలిత్ ఝాను పోలీసులు దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో కీలక సూత్రదారి అని, అతడిని 15 రోజుల పోలీసుల కస్టడీకి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే.. దిల్లీ కోర్టు జడ్జి హర్దీప్ కౌర్ నిందితుడు లలిత్ ఝాకు వారం రోజులపాటు పోలీసు కస్టడీ విధించారు. గురువారం పార్లమెంట్​లో అలజడి కేసులో మనోరంజన్, సాగర్ శర్మ, అమోల్ ధన్‌రాజ్ శిందే, నీలం దేవికి ఇప్పటికే వారం రోజుల కస్టడీ విధించింది కోర్టు.

'చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా'
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో లలిత్ ఝా ఉండడంపై అతడి సోదరుడు శంభు ఝా స్పందించారు. తన సోదరుడు ఈ వివాదంలో ఎలా చిక్కుకున్నాడో తమకు తెలియదని అన్నారు. అతడు చిన్నప్పటి నుంచి వివాదాలకు దూరంగా ప్రశాంతంగా ఉండేవాడని చెప్పారు. టీవీ ఛానల్​లో నిందితుడిగా లలిత్ ఝా ఫొటోలను చూసి కుటుంట సభ్యులు ఆశ్చర్యపోయామని తెలిపారు.

దద్దరిల్లిన ఉభయసభలు- సోమవారానికి వాయిదా
లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం ఉదయం 11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి బాధ్యతగా కేంద్ర హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. భద్రతా వైఫల్యంపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ఆగంతకులను పాసులు జారీచేసిన బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విపక్ష ఎంపీల నినాదాలతో ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలగడం వల్ల స్పీకర్‌ ఓం బిర్లా స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్‌ సభను తొలుత మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశమైనా పరిస్థితిలో మార్పు లేకపోవటం వల్ల సభ సోమవారానికి వాయిదా పడింది.

అటు రాజ్యసభ కూడా సోమవారానికి వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశంకాగానే భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్‌ జగదీశ్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. దీంతో విపక్ష ఎంపీలు భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుపట్టడం సహా టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం వల్ల ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదావేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు.

సస్పెన్షన్ వేటు పడిన ఎంపీల మౌనదీక్ష
సస్పెన్షన్ వేటు పడిన విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అంతకుముందు సస్పెన్షన్‌ వేటు పడిన ఎంపీలు పార్లమెంటు భవన ద్వారం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ వారిని కలిశారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని ఉభయసభల్లో ఆందోళన చేసినందుకు లోక్‌సభకు చెందిన 13మంది ఎంపీలు, రాజ్యసభకు చెందిన డెరెక్‌ ఒబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. శీతాకాల పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్‌ విధించారు.

'అమిత్ షాపై కాంగ్రెస్ ఫైర్​'
లోక్​సభలో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటన ఇవ్వకుండా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై ప్రశ్నలు అడిగిన ఎంపీలను చట్టవిరుద్ధంగా సస్పెండ్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.

లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఉభయసభలకు హాజరై ప్రకటన చేయనంతవరకు పార్లమెంటు సమావేశాలు సాగే అవకాశం లేదని కాంగ్రెస్‌ తేల్చిచెప్పింది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నేతలు ఈ విషయాన్ని ఛైర్మన్ జగదీశ్‌ ధన్‌ఖడ్‌కు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఉభయసభలకు హాజరై ఓ ప్రకటన చేయాలని ఆ తర్వాత సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అంతవరకు సభలు సాగే అవకాశమే లేదని జైరాం రమేశ్ స్పష్టంచేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయని ఆయన గుర్తు చేశారు.

  • #WATCH | Delhi: On the adjournment of Parliament, Congress leader Jairam Ramesh says, "Until the Home Minister comes in both the Houses of the Parliament and makes a statement, there are very few possibilities that the Parliament would run. There are still 4 days left (of the… pic.twitter.com/nGmV9m47HX

    — ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'విపక్షాలు సభకు హాజరవ్వాలి'
పార్లమెంటులో భద్రతా వైఫల్యానికి సంబంధించిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ అంశంపై ఉభయసభల్లో చర్చ జరపటం సహా హోం మంత్రి ప్రకటన చేసే వరకు సమావేశాలను జరగనివ్వబోమని ప్రతిపక్షాలు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. తమ గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణను మీడియా ప్రతినిధులు ప్రహ్లాద్‌ జోషి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. ఎవరూ మరొకరి గొంతు నొక్కే ప్రయత్నం చేయటం లేదని, అది వారి అభిప్రాయం కావచ్చని సమాధానం ఇచ్చారు. ప్రతిపక్షాలు సభకు హాజరై చర్చలో పాల్గొనాలని ప్రహ్లాద్‌ జోషి సూచించారు. సోమవారం పాత నేరచట్టాల స్థానంలో తెచ్చిన 3కొత్త బిల్లులపై విస్తృత చర్చ జరగనుందని, అందుకోసం 15గంటల సమయం కేటాయించినట్లు ప్రహ్లాద్‌ జోషి తెలిపారు.

కోర్టులోనే మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు!- రంగంలోకి సీజేఐ- నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

దేశంలోనే అతిపెద్దదిగా, తాజ్​మహల్​కన్నా అందంగా అయోధ్య మసీదు- మక్కా ఇమామ్​తో శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.