ETV Bharat / bharat

కౌన్సిలర్​ అల్లుడు దారుణ హత్య.. BJP నాయకుడి హోటల్​ను కూల్చేసిన సర్కార్​!

author img

By

Published : Jan 4, 2023, 10:23 AM IST

Updated : Jan 4, 2023, 2:39 PM IST

భాజపా నాయకుడి హోటల్​ను రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది! అక్రమంగా హోటల్​ను నిర్మించినందుకు సర్కార్​ ఈ చర్య తీసుకుంది. 60 డైనమిట్లను ఉపయోగించి హోటల్​ను నేలమట్టం చేసింది.

hotel-of-bjp-leader-accused-of-murder-razed-with-dynamites-in-madyapradesh
భాజపా నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా హోటల్​ కూల్చేవేత

మధ్యప్రదేశ్​కు చెందిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుడి హోటల్​ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. మంగళవారం సాగర్​ జిల్లా యంత్రాంగం హోటల్​ను నేలమట్టం చేసింది. హోటల్​ యజమాని.. స్థానిక కౌన్సిలర్​ అల్లుడిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని ఇటీవలే భాజపా.. పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మకరోనియా కూడలిలో భాజపా మాజీ నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా అక్రమంగా ఓ హోటల్​ను నిర్మించాడు. విచారణ అనంతరం జిల్లా కలెక్టర్​, డీఐజీ అధ్వర్యంలో హోటల్​ను అధికారులు కూల్చివేశారు. 60 డైనమిట్లను ఉపయోగించి గుప్తాకు చెందిన హోటల్​ను నేలమట్టం చేశారు. "హోటల్​ను​ కూల్చేముందు భద్రతా చర్యలు తీసుకున్నాం. ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డంగా ఉంచి ట్రాఫిక్​ను నిలువరించాం. చుట్టుపక్కల ఉన్న నివాసులను అలెర్ట్​ చేశాం. కూల్చివేసే సమయంలో ఎటువంటి నష్టం జరగలేదు. హోటల్ ఒక్కటే నేలమట్టం అయింది" అని జిల్లా కలెక్టర్​ దీపక్​ ఆర్య తెలిపారు.

ఆయితే మిశ్రీ చంద్ గుప్తా స్థానిక కౌన్సిలర్​ అల్లుడు జగదీశ్​ యాదవ్​ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. డిసెంబర్​ 22న జగదీశ్​ యాదవ్​ను కారుతో ఢీకొట్టి హత్య చేయించాడని, గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్​ హత్య కేసులో ఎనిమిది మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుప్తాతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. స్థానిక మున్సిపల్​ ఎన్నికల్లో.. జగదీశ్​ యాదవ్​ మామ కిరణ్​ యాదవ్ స్వతంత్రగా పోటీ చేసి​ గుప్తా భార్య మీనపై 83 ఓట్లతో గెలుపొందాడు. ఈ కోపంతోనే జగదీశ్​ను గుప్తా​ చంపాడని ఆరోపణలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్​కు చెందిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుడి హోటల్​ను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసింది. మంగళవారం సాగర్​ జిల్లా యంత్రాంగం హోటల్​ను నేలమట్టం చేసింది. హోటల్​ యజమాని.. స్థానిక కౌన్సిలర్​ అల్లుడిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని ఇటీవలే భాజపా.. పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మకరోనియా కూడలిలో భాజపా మాజీ నాయకుడు మిశ్రీ చంద్ గుప్తా అక్రమంగా ఓ హోటల్​ను నిర్మించాడు. విచారణ అనంతరం జిల్లా కలెక్టర్​, డీఐజీ అధ్వర్యంలో హోటల్​ను అధికారులు కూల్చివేశారు. 60 డైనమిట్లను ఉపయోగించి గుప్తాకు చెందిన హోటల్​ను నేలమట్టం చేశారు. "హోటల్​ను​ కూల్చేముందు భద్రతా చర్యలు తీసుకున్నాం. ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డంగా ఉంచి ట్రాఫిక్​ను నిలువరించాం. చుట్టుపక్కల ఉన్న నివాసులను అలెర్ట్​ చేశాం. కూల్చివేసే సమయంలో ఎటువంటి నష్టం జరగలేదు. హోటల్ ఒక్కటే నేలమట్టం అయింది" అని జిల్లా కలెక్టర్​ దీపక్​ ఆర్య తెలిపారు.

ఆయితే మిశ్రీ చంద్ గుప్తా స్థానిక కౌన్సిలర్​ అల్లుడు జగదీశ్​ యాదవ్​ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. డిసెంబర్​ 22న జగదీశ్​ యాదవ్​ను కారుతో ఢీకొట్టి హత్య చేయించాడని, గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. జగదీశ్​ హత్య కేసులో ఎనిమిది మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గుప్తాతో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. స్థానిక మున్సిపల్​ ఎన్నికల్లో.. జగదీశ్​ యాదవ్​ మామ కిరణ్​ యాదవ్ స్వతంత్రగా పోటీ చేసి​ గుప్తా భార్య మీనపై 83 ఓట్లతో గెలుపొందాడు. ఈ కోపంతోనే జగదీశ్​ను గుప్తా​ చంపాడని ఆరోపణలు ఉన్నాయి.

Last Updated : Jan 4, 2023, 2:39 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.