ఉత్తర్ప్రదేశ్ బిజ్నోర్లో సామర్థ్యానికి మించి చెరుకుగడలను రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడి.. నిండు ప్రాణాన్ని బలిగొంది.
నగీనా రోడ్ ధామ్పుర్ షుగర్ మిల్లువైపు వెళ్తున్న ట్రాక్టర్.. అధిక బరువు వల్ల ఓ ప్రముఖ షాపింగ్మాల్ ఎదుట అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే నిల్చున్న ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరు వాహనదారులపైన చెరుకు గడలు పడిపోయాయి. ఈ దృశ్యాలు సీసీటీవీలో స్పష్టంగా బందీ అయ్యాయి.
ఈ ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:'నాకు పెళ్లి కావాలి.. వధువును వెతికి పెట్టండయ్యా..!'