ETV Bharat / bharat

నీతి ఆయోగ్​లో కరోనా కలకలం- కార్యాలయం బంద్

author img

By

Published : Apr 28, 2020, 1:49 PM IST

నీతి ఆయోగ్​ భవనాన్ని 48 గంటలపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సంస్థ అధికారుల్లో ఒకరికి కరోనా సోకినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Officer in NITI Aayog tests positive for COVID-19, building sealed
నీతి ఆయోగ్​ అధికారికి కరోనా.. 48 గంటల పాటు భవనం మూసివేత

నీతి ఆయోగ్​కు చెందిన ఓ అధికారికి కరోనా సోకింది. దీంతో దిల్లీలోని సంస్థ భవనాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

"నీతి ఆయోగ్​లో పని చేసే డైరెక్టర్​ స్థాయి అధికారికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయ్యింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల ఫలితం వెలువడిన తర్వాత ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. నిబంధనల​ ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాము. అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ, 48 గంటలు పాటు నీతి ఆయోగ్​ భవనాన్ని మూసివేస్తున్నాం."

-అలోక్​ కుమార్​, నీతి అయోగ్​ సలహాదారు

ఆ అధికారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు వెల్లడించారు అలోక్.

ఇటివల విమానయాన మంత్రిత్వ శాఖలో పని చేసే ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా ఆ శాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇలానే మూసివేశారు.

నీతి ఆయోగ్​కు చెందిన ఓ అధికారికి కరోనా సోకింది. దీంతో దిల్లీలోని సంస్థ భవనాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

"నీతి ఆయోగ్​లో పని చేసే డైరెక్టర్​ స్థాయి అధికారికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయ్యింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల ఫలితం వెలువడిన తర్వాత ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. నిబంధనల​ ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమాచారం అందించాము. అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తూ, 48 గంటలు పాటు నీతి ఆయోగ్​ భవనాన్ని మూసివేస్తున్నాం."

-అలోక్​ కుమార్​, నీతి అయోగ్​ సలహాదారు

ఆ అధికారితో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు వెల్లడించారు అలోక్.

ఇటివల విమానయాన మంత్రిత్వ శాఖలో పని చేసే ఉద్యోగికి కరోనా సోకిన కారణంగా ఆ శాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇలానే మూసివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.