ETV Bharat / bharat

'ఆవుపేడ' పాదరక్షలు ధరించండి... ఆరోగ్యాన్ని కాపాడుకోండి

ఏ రోడ్డు పక్కనో.. పొలాల మధ్యనో నడుస్తున్నప్పుడు చెప్పులకు కాస్త పేడ అంటుకుంటే చాలు.. 'షిట్' అని చీదరించుకుంటాం. కానీ, హిమాచల్​ప్రదేశ్​లోని ఓ సంస్థ మాత్రం ఆవుపేడతోనే పాదరక్షలు తయారు చేసి అందరినీ మెప్పిస్తోంది. అంతే కాదు, ఈ చెప్పులతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ప్రజలకు చెబుతోంది

author img

By

Published : Feb 29, 2020, 8:18 AM IST

Updated : Mar 2, 2020, 10:32 PM IST

Dung slippers became the attraction of Mandi Maha Shivaratri
ఆరోగ్యం కోసం ఆవుపేడ పాదరక్షలు...
ఆరోగ్యం కోసం ఆవుపేడ పాదరక్షలు...

జంతు చర్మాలతో చేసిన చెప్పులు చూసి ఉంటారు.. రెక్సిన్​, లెదర్, రబ్బరుతో తయారైన పాదరక్షలు ధరించి ఉంటారు.. మరి ఎప్పుడైనా.. 'ఆవు పేడ చెప్పులు' వేసుకున్నారా? ​అసలు పేడతో చెప్పులేంటి అనుకుంటున్నారా? నిజమే ఇప్పటి వరకు అలాంటి ఉత్పత్తి ఎవరూ చేసి ఉండరు. కానీ, హిమాచల్​ప్రదేశ్​లోని 'వైదిక్ ప్లాస్టర్'​ సంస్థ ఆవు పేడతో చెప్పులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పేడను జల్లెడ పట్టి, అందులో సహజ నూనెలు కలిపి తయారు చేశారు ఈ చెప్పులు. 'గోమాత చరణ పాదుకాలు'గా నామకరణం చేసిన ఈ పాదరక్షలను మండి జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ శివరాత్రి మహోత్సవంలో ప్రదర్శనకు పెట్టారు. వినూత్నంగా కనిపించే ఈ చెప్పులు పర్యావరణహితమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు పంపిణీదారులు.

"మా ప్రత్యేక ఉత్పత్తి వైదిక్​ చెప్పులు. ఇవి ప్రపంచంలో తొలి పేడ​ పాదరక్షలు. ఇవి, దేశీయ ఆవుల పేడతో తయారయ్యాయి. వీటిని ధరించడం వల్ల అలసట, చిరాకు దూరమైపోతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగి బీపీ వంటి రోగాలు దరిచేరవు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా తోడ్పడుతాయి."- కరణ్​ సింగ్​, మండి జిల్లా డిస్ట్రిబ్యూటర్.

ఎలాంటి రసాయనాలు, కాలుష్య కారకాలు లేకుండా తయారు చేసిన ఈ పాదరక్షలను... ప్రస్తుతానికి ప్రజల్లో అవగాహన కల్పించటానికి మాత్రమే తయారు చేశారు. అయితే, ఈ వినూత్న ప్రయత్నానికి వినియోగదారులు ఫిదా అవుతున్నారు. పేడ చెప్పులు మాకు కావాలంటే మాకు కావలని ఆర్డర్లు పెట్టేస్తున్నారు.

ఇదీ చదవండి:నూడుల్స్​తోనే ఆకలి తీర్చుకుంటున్న దిల్లీ వాసులు!

ఆరోగ్యం కోసం ఆవుపేడ పాదరక్షలు...

జంతు చర్మాలతో చేసిన చెప్పులు చూసి ఉంటారు.. రెక్సిన్​, లెదర్, రబ్బరుతో తయారైన పాదరక్షలు ధరించి ఉంటారు.. మరి ఎప్పుడైనా.. 'ఆవు పేడ చెప్పులు' వేసుకున్నారా? ​అసలు పేడతో చెప్పులేంటి అనుకుంటున్నారా? నిజమే ఇప్పటి వరకు అలాంటి ఉత్పత్తి ఎవరూ చేసి ఉండరు. కానీ, హిమాచల్​ప్రదేశ్​లోని 'వైదిక్ ప్లాస్టర్'​ సంస్థ ఆవు పేడతో చెప్పులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పేడను జల్లెడ పట్టి, అందులో సహజ నూనెలు కలిపి తయారు చేశారు ఈ చెప్పులు. 'గోమాత చరణ పాదుకాలు'గా నామకరణం చేసిన ఈ పాదరక్షలను మండి జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ శివరాత్రి మహోత్సవంలో ప్రదర్శనకు పెట్టారు. వినూత్నంగా కనిపించే ఈ చెప్పులు పర్యావరణహితమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు పంపిణీదారులు.

"మా ప్రత్యేక ఉత్పత్తి వైదిక్​ చెప్పులు. ఇవి ప్రపంచంలో తొలి పేడ​ పాదరక్షలు. ఇవి, దేశీయ ఆవుల పేడతో తయారయ్యాయి. వీటిని ధరించడం వల్ల అలసట, చిరాకు దూరమైపోతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగి బీపీ వంటి రోగాలు దరిచేరవు. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు కూడా తోడ్పడుతాయి."- కరణ్​ సింగ్​, మండి జిల్లా డిస్ట్రిబ్యూటర్.

ఎలాంటి రసాయనాలు, కాలుష్య కారకాలు లేకుండా తయారు చేసిన ఈ పాదరక్షలను... ప్రస్తుతానికి ప్రజల్లో అవగాహన కల్పించటానికి మాత్రమే తయారు చేశారు. అయితే, ఈ వినూత్న ప్రయత్నానికి వినియోగదారులు ఫిదా అవుతున్నారు. పేడ చెప్పులు మాకు కావాలంటే మాకు కావలని ఆర్డర్లు పెట్టేస్తున్నారు.

ఇదీ చదవండి:నూడుల్స్​తోనే ఆకలి తీర్చుకుంటున్న దిల్లీ వాసులు!

Last Updated : Mar 2, 2020, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.