దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కొత్తగా 67,151 కేసులు వెలుగుచూశాయి. వైరస్ కారణంగా మరో 1,059 మంది ప్రాణాలు కోల్పోయారు.

రికవరీ రేటులో పెరుగుదల
పెరుగుతున్న వైరస్ కేసులకు అనుగుణంగా.. కోలుకున్న వారి సంఖ్యా గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్త రికవరీ రేటు 76 శాతానికిపైగా నమోదైంది. మరణాల రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.84 శాతానికి పడిపోయింది.
ఇదీ చదవండి: 'సోనూ'కు సమాచారమిస్తే చాలు సాయమందినట్టే!