ETV Bharat / bharat

ఆపరేషన్​ మర్కజ్​: ఆ 5 రైళ్లలో వెళ్లిన వారి కోసం వేట

దేశంలో కరోనా విజృంభణకు దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ఘటన కారణమైంది. ఈ నేపథ్యంలో నిజాముద్దీన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, వారితో పాటు ప్రయాణించిన వారిని గుర్తించేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం మార్చి 13 నుంచి 19 మధ్య దిల్లీ నుంచి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లిన రైళ్లలో ప్రయాణించినవారి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలతో కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ చేపడుతున్నారు.

author img

By

Published : Apr 1, 2020, 3:42 PM IST

corona train
5 రైళ్లు.. వేలసంఖ్యలో ప్రయాణికులు.. ఒక కరోనా

దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్​ వ్యవహారంతో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మర్కజ్​ను దర్శించిన వారిని గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కలిసి ప్రయాణం చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. తబ్లీగీ జమాత్​ నుంచి సొంత రాష్ట్రాలకు వెనక్కి వచ్చేందుకు అవకాశమున్న ఐదు రైళ్ల ప్రయాణికుల వివరాలు వెలికితీస్తోంది.

మార్చి 13 నుంచి 19 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు దురంతో, చెన్నైకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్​ప్రెస్, దిల్లీ-రాంచీ మధ్య రాజధాని ఎక్స్​ప్రెస్, ఏపీకి సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లు నడిచాయని గుర్తించారు అధికారులు. మర్కజ్​లో పాల్గొన్నవారు ఈ రైళ్లలో వెళ్లే అవకాశం ఉన్న కారణంగా ప్రయాణికుల జాబితాను వెలికితీసే పనిలో పడ్డారు. ఒక్కో రైలులో 1000 నుంచి 1200మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని.. వారంతా వైరస్​ సోకే ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడించారు. రైల్వే అధికారులు అందించే జాబితాతో ఆయా జిల్లాల్లో ఉన్న అధికారులు మర్కజ్​లో పాల్గొన్నవారి వివరాలను సరిపోలుస్తారని వెల్లడించారు అధికారులు. దీనిద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ చేపడతారని వివరించారు.

తెలంగాణలో ఇండోనేషియన్లు..

ఇలా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ద్వారానే తెలంగాణ కరీంనగర్​లో పదిమంది ఇండోనేషియన్లను గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం వారికి కరోనా పాజిటివ్​గా ఉన్నట్లు తేలిందని గుర్తు చేశారు.

రాంచీ మహిళ గుర్తింపు..

దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్​ప్రెస్​లో ప్రయాణించిన ఓ మలేసియా మహిళకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ కారణంగా ఆమె ప్రయాణించిన కోచ్​లోని 60 మందిని గుర్తించేందుకు కృషిచేస్తున్నారు అధికారులు. వారి వివరాలను తెలుసుకుని ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తున్నారు.

అయితే ఆంక్షలు అమలు చేయకముందు వీరంతా రైళ్లలో ప్రయాణించిన కారణంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కష్టమవుతోందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'పేదలపై దృష్టి సారిస్తేనే భారత్​లో కరోనా కట్టడి సాధ్యం'

దిల్లీ నిజాముద్దీన్ మర్కజ్​ వ్యవహారంతో దేశంలో కరోనా కేసులు పెరిగాయి. వ్యాధి ఇతరులకు సంక్రమించే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మర్కజ్​ను దర్శించిన వారిని గుర్తించి నిర్బంధ కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. ప్రార్థనల్లో పాల్గొన్నవారితో కలిసి ప్రయాణం చేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. తబ్లీగీ జమాత్​ నుంచి సొంత రాష్ట్రాలకు వెనక్కి వచ్చేందుకు అవకాశమున్న ఐదు రైళ్ల ప్రయాణికుల వివరాలు వెలికితీస్తోంది.

మార్చి 13 నుంచి 19 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరుకు దురంతో, చెన్నైకు గ్రాండ్ ట్రంక్ ఎక్స్​ప్రెస్, దిల్లీ-రాంచీ మధ్య రాజధాని ఎక్స్​ప్రెస్, ఏపీకి సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లు నడిచాయని గుర్తించారు అధికారులు. మర్కజ్​లో పాల్గొన్నవారు ఈ రైళ్లలో వెళ్లే అవకాశం ఉన్న కారణంగా ప్రయాణికుల జాబితాను వెలికితీసే పనిలో పడ్డారు. ఒక్కో రైలులో 1000 నుంచి 1200మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని.. వారంతా వైరస్​ సోకే ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడించారు. రైల్వే అధికారులు అందించే జాబితాతో ఆయా జిల్లాల్లో ఉన్న అధికారులు మర్కజ్​లో పాల్గొన్నవారి వివరాలను సరిపోలుస్తారని వెల్లడించారు అధికారులు. దీనిద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ చేపడతారని వివరించారు.

తెలంగాణలో ఇండోనేషియన్లు..

ఇలా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ ద్వారానే తెలంగాణ కరీంనగర్​లో పదిమంది ఇండోనేషియన్లను గుర్తించినట్లు వెల్లడించారు. అనంతరం వారికి కరోనా పాజిటివ్​గా ఉన్నట్లు తేలిందని గుర్తు చేశారు.

రాంచీ మహిళ గుర్తింపు..

దిల్లీ-రాంచీ రాజధాని ఎక్స్​ప్రెస్​లో ప్రయాణించిన ఓ మలేసియా మహిళకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ కారణంగా ఆమె ప్రయాణించిన కోచ్​లోని 60 మందిని గుర్తించేందుకు కృషిచేస్తున్నారు అధికారులు. వారి వివరాలను తెలుసుకుని ఆరోగ్య పరిస్థితి ఆరా తీస్తున్నారు.

అయితే ఆంక్షలు అమలు చేయకముందు వీరంతా రైళ్లలో ప్రయాణించిన కారణంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కష్టమవుతోందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'పేదలపై దృష్టి సారిస్తేనే భారత్​లో కరోనా కట్టడి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.