ETV Bharat / bharat

ఆమెతో సంబంధం.. శీలానికి అగ్నిపరీక్ష.. చివరికి నెగ్గాడా?

author img

By

Published : Mar 2, 2023, 12:40 PM IST

Updated : Mar 2, 2023, 1:43 PM IST

శాస్త్రసాంకేతిక విజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరుణమిది. అయినా ఈ రోజుల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి తనపై మోపిన నింద అబద్ధమని నిరూపించేకునేందుకు కులపెద్దలు చెప్పారని అగ్నిపరీక్షకు సిద్ధపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

Mulugu District
Mulugu District
కులపెద్దలు చెప్పారని అగ్నిపరీక్షకు సిద్ధపడ్డ వ్యక్తి.. ఆ తర్వాత

ఊరికి, ఊళ్లో జనాలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు నిలబడేది.. గ్రామ పెద్దలే. తరతరాలను చూసిన కళ్లతో.. మంచీచెడూ చూసిన అపార అనుభవంతో ఒకే ఒక్క మాటతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. ఆధునిక కాలంలోనూ దురాచారాలను ప్రజలపై రుద్దుతూ.. ఆటవికుల్లా ప్రవర్తించే పెద్దమనుషులే ఊళ్లో ఉంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ వ్యక్తి అంటగట్టిన వివాహేతర బంధాన్ని నిరూపించుకోవాలంటూ అమాయకుడికి అగ్నిపరీక్ష పెట్టి బతికుండగానే గ్రామపెద్దలు నరకం చూపించారు. ములుగు మండలం బరిగెలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్‌.. ఊళ్లలో వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి గంగాధర్‌పై ఆరోపణలు చేశాడు. ఈ వివాదంపై రంగప్రవేశం చేసిన గ్రామంలోని పెద్దమనుషులు.. నిజం నిరూపించుకోవాలని గంగాధర్‌కు హుకుం జారీచేశారు.

మంటల్లో గడ్డపారను ఎర్రగా కాల్చి దానిని పట్టుకోవాలని.. చేతులు కాలితే తప్పు చేసినట్లని, అందుకు 4లక్షల రూపాయలు ఇవ్వాలని తెల్చిచెప్పారు. చేతులు కాలని పక్షంలో తప్పుచేయనట్లేనని.. అందుకు ఆరోపణలు చేసిన వ్యక్తి 4లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు. ఓ వైపు పెద్దమనుషులు ఒత్తిడి.. మరోవైపు తనపై పడిన నిందను భరించలేని గంగాధర్‌ ఇక ఎర్రగా కాలిన గడ్డపలుగును పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

గత నెల 25న గ్రామ సమీపంలోని లక్నవరం సరస్సు వద్దకు తీసుకువెళ్లి మంటలు పెట్టారు. అందులో గడ్డపలుగును ఉంచి.. ఎర్రగా కాల్చారు. చెరువులో స్నానం చేసిన గంగాధర్‌.. తడి దుస్తులతో పెద్దమనుషులు సమక్షంలో మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో బయటికి తీశాడు. త్వరగా తీసి బయట పడేయటంతో గంగాధర్‌ చేతులకు అంతగా గాయాలు కాలేదు.

గంగాధర్‌ గడ్డపారను మంటల్లో నుంచి తీసినప్పటికీ పెద్దమనుషులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఏదేమైనా ఆరోపణలు చేసిన వ్యక్తికి 4లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేదేమిలేక గంగాధర్‌ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు. తనపై తప్పుడు నిందలు మోపి.. తన జీవితంతో ఆడుకుంటున్నారని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

"మా పెద్దమ్మ కుమారుడు నాపై ఈ నింద మోపాడు. మూడు నెలలనుంచి కులపెద్దలతో ఈవిషయం చెప్పాడు. గడ్డపార పరీక్ష పెట్టాలని పెద్దమనుషులు చెప్పారు. గత నెల 25న లక్నవరం చెరువులో గడ్డపార పరీక్ష పెట్టారు. అందులో చేతులో కాలలేదు. ఆమెకు నాకు సంబంధం లేదు. ఇదంతా చేసింది గంగయ్య. ఆయన మాత్రం 4 లక్షల రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. పెద్దమనుషుల సమక్షంలోనూ న్యాయం జరగలేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను." - గంగాధర్‌, బాధితుడు

ఇవీ చదవండి: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రూ.86లక్షల మోసం! షారుక్​ భార్య గౌరీ ఖాన్​పై కేసు

కులపెద్దలు చెప్పారని అగ్నిపరీక్షకు సిద్ధపడ్డ వ్యక్తి.. ఆ తర్వాత

ఊరికి, ఊళ్లో జనాలకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు నిలబడేది.. గ్రామ పెద్దలే. తరతరాలను చూసిన కళ్లతో.. మంచీచెడూ చూసిన అపార అనుభవంతో ఒకే ఒక్క మాటతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. ఆధునిక కాలంలోనూ దురాచారాలను ప్రజలపై రుద్దుతూ.. ఆటవికుల్లా ప్రవర్తించే పెద్దమనుషులే ఊళ్లో ఉంటే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ ఘటన ములుగు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ వ్యక్తి అంటగట్టిన వివాహేతర బంధాన్ని నిరూపించుకోవాలంటూ అమాయకుడికి అగ్నిపరీక్ష పెట్టి బతికుండగానే గ్రామపెద్దలు నరకం చూపించారు. ములుగు మండలం బరిగెలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్‌.. ఊళ్లలో వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ ఇటీవల ఓ వ్యక్తి గంగాధర్‌పై ఆరోపణలు చేశాడు. ఈ వివాదంపై రంగప్రవేశం చేసిన గ్రామంలోని పెద్దమనుషులు.. నిజం నిరూపించుకోవాలని గంగాధర్‌కు హుకుం జారీచేశారు.

మంటల్లో గడ్డపారను ఎర్రగా కాల్చి దానిని పట్టుకోవాలని.. చేతులు కాలితే తప్పు చేసినట్లని, అందుకు 4లక్షల రూపాయలు ఇవ్వాలని తెల్చిచెప్పారు. చేతులు కాలని పక్షంలో తప్పుచేయనట్లేనని.. అందుకు ఆరోపణలు చేసిన వ్యక్తి 4లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు. ఓ వైపు పెద్దమనుషులు ఒత్తిడి.. మరోవైపు తనపై పడిన నిందను భరించలేని గంగాధర్‌ ఇక ఎర్రగా కాలిన గడ్డపలుగును పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

గత నెల 25న గ్రామ సమీపంలోని లక్నవరం సరస్సు వద్దకు తీసుకువెళ్లి మంటలు పెట్టారు. అందులో గడ్డపలుగును ఉంచి.. ఎర్రగా కాల్చారు. చెరువులో స్నానం చేసిన గంగాధర్‌.. తడి దుస్తులతో పెద్దమనుషులు సమక్షంలో మంటల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో బయటికి తీశాడు. త్వరగా తీసి బయట పడేయటంతో గంగాధర్‌ చేతులకు అంతగా గాయాలు కాలేదు.

గంగాధర్‌ గడ్డపారను మంటల్లో నుంచి తీసినప్పటికీ పెద్దమనుషులు మాత్రం సంతృప్తి చెందలేదు. ఏదేమైనా ఆరోపణలు చేసిన వ్యక్తికి 4లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇక చేసేదేమిలేక గంగాధర్‌ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించాడు. తనపై తప్పుడు నిందలు మోపి.. తన జీవితంతో ఆడుకుంటున్నారని గంగాధర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

"మా పెద్దమ్మ కుమారుడు నాపై ఈ నింద మోపాడు. మూడు నెలలనుంచి కులపెద్దలతో ఈవిషయం చెప్పాడు. గడ్డపార పరీక్ష పెట్టాలని పెద్దమనుషులు చెప్పారు. గత నెల 25న లక్నవరం చెరువులో గడ్డపార పరీక్ష పెట్టారు. అందులో చేతులో కాలలేదు. ఆమెకు నాకు సంబంధం లేదు. ఇదంతా చేసింది గంగయ్య. ఆయన మాత్రం 4 లక్షల రూపాయలు ఇవ్వాలని అంటున్నాడు. పెద్దమనుషుల సమక్షంలోనూ న్యాయం జరగలేదు. అందుకే పోలీసులను ఆశ్రయించాను." - గంగాధర్‌, బాధితుడు

ఇవీ చదవండి: ఫోన్‌లో గేమ్స్ ఆడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

రూ.86లక్షల మోసం! షారుక్​ భార్య గౌరీ ఖాన్​పై కేసు

Last Updated : Mar 2, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.