ETV Bharat / snippets

విజయనగరం జిల్లాలో ఏనుగుల హల్​చల్- భయాందోళనలో ప్రజలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 12:08 PM IST

Elephants Hulchul in  Vizianagaram
Elephants Hulchul in Vizianagaram (ETV Bharat)

Elephants Wandering Vizianagaram District : విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం కలకలం రేపింది. వంగర మండలంలోని వీవీఆర్ పేట, రాజులుగుమ్మడ గ్రామాల్లోకి ఆరు ఏనుగులు ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తోటల్లోకి అవి ప్రవేశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు వారు జంకుతున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Elephants Wandering Vizianagaram District : విజయనగరం జిల్లాలో గజరాజుల సంచారం కలకలం రేపింది. వంగర మండలంలోని వీవీఆర్ పేట, రాజులుగుమ్మడ గ్రామాల్లోకి ఆరు ఏనుగులు ప్రవేశించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు తోటల్లోకి అవి ప్రవేశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు వారు జంకుతున్నారు. దీనిపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను ఏనుగుల బారి నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.