ETV Bharat / snippets

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన అంబులెన్స్ - డ్రైవర్​ మృతి, పేషెంట్​తో సహా మరో ఇద్దరికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 2:54 PM IST

The ambulance hit the lorry
Ambulance Accident in Miryalaguda (ETV Bharat)

The ambulance hit the lorry: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం అద్దంకి - నార్కట్​పల్లి వద్ద రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్​ ఢీకొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్​కు పేషెంట్​ను అంబులెన్స్​ తీసుకెళుతుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్​లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పేషెంట్​తో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నెల్లూరుకి చెందిన రాకేష్ (30)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

The ambulance hit the lorry: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం అద్దంకి - నార్కట్​పల్లి వద్ద రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అంబులెన్స్​ ఢీకొట్టింది. శుక్రవారం అర్ధరాత్రి నెల్లూరు నుంచి హైదరాబాద్​కు పేషెంట్​ను అంబులెన్స్​ తీసుకెళుతుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్​లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పేషెంట్​తో సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లనే రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నెల్లూరుకి చెందిన రాకేష్ (30)గా పోలీసులు గుర్తించారు. ఘటనపై మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.