ETV Bharat / snippets

ఈజిప్టులో ఘోర బస్సు ప్రమాదం - 12 మంది విద్యార్థులు మృతి, 33 మందికి తీవ్రగాయాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 8:14 AM IST

accident
accident (ANI)

Egypt Bus Crash : ఈజిప్టులోని ఈశాన్య ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న బస్సు బోల్తా పడడం వల్ల 12 మంది యూనివర్సిటీ విద్యార్థులు మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొంది.

విద్యార్థులు అందరూ సూయజ్ బేస్డ్​ గలాలా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ నుంచి వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో వెల్లడించలేదు. ఈజిప్టులో ఏటా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అధ్వన్నమైన రోడ్లు, అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం మొదలైనవే ఇందుకు కారణమని సమాచారం.

Egypt Bus Crash : ఈజిప్టులోని ఈశాన్య ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళ్తున్న బస్సు బోల్తా పడడం వల్ల 12 మంది యూనివర్సిటీ విద్యార్థులు మరణించగా, మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొంది.

విద్యార్థులు అందరూ సూయజ్ బేస్డ్​ గలాలా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు అని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ నుంచి వాళ్లు తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కానీ ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటో వెల్లడించలేదు. ఈజిప్టులో ఏటా చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అధ్వన్నమైన రోడ్లు, అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ చట్టాలను సరిగ్గా అమలు చేయకపోవడం మొదలైనవే ఇందుకు కారణమని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.