LIVE ప్రొద్దుటూరు బహిరంగలో వైఎస్ షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila - YS SHARMILA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 13, 2024, 6:05 PM IST
|Updated : Apr 13, 2024, 8:44 PM IST
YS Sharmila Election Campaign Live in Kadapa District : ఏపీ న్యాయ యాత్ర పేరుతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా ఇవాళ వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గంల్లో పర్యటిస్తున్నారు. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఇవాళ ముద్దునూరు పాత బస్టాండ్ షర్మిల బహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీగా వైఎస్ బిడ్డ కావాలో హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. ముద్దనూరులో ఆమె వైఎస్ సునీతతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిందితులను సీఎం హోదాలో జగన్ కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసే ముందు ధర్మం ఎవరివైపు ఉందో చూసి వేయాలన్నారు. వివేకా గొడ్డలి పోటుతో చనిపోతే సాక్షి ఛానల్లో గుండెపోటు అని చిత్రీకరించారని షర్మిల చెప్పారు. గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టీల్ప్లాంట్ నిర్మాణ ప్రాంతాన్ని షర్మిల సందర్శించారు. రాజశేఖరరెడ్డి బతికే ఉంటే స్టీల్ప్లాంట్ కల సాకరమయ్యేదన్నారు.
Last Updated : Apr 13, 2024, 8:44 PM IST