LIVE: మైదుకూరులో 'స్వచ్ఛ ఆంధ్ర' ర్యాలీ - పాల్గొన్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - CHANDRABABU SWATCH RALLY LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 18, 2025, 3:48 PM IST
|Updated : Jan 18, 2025, 5:44 PM IST
CM Chandrababu Naidu participated in the Swachh Andhra rally : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. NTR విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రసంగించారు. పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్ కల అన్న చంద్రబాబు పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. చరిత్ర ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి NTR అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు అని పేర్కొన్నారు. అనంతరం పారిశుద్ధ కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రస్తుతం మైదుకూరు నాలుగు రోడ్ల కూడలి నుంచి జడ్పీ హైస్కూల్ వరకు స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ చేపట్టారు. స్వచ్ఛ ఆంధ్ర ఉద్దేశాన్ని తెలియజేస్తూ నేషనల్ గ్రీన్ కాప్స్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆకుపచ్చ జండాలు పట్టుకుని విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు నడిచారు. ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Jan 18, 2025, 5:44 PM IST