thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 28, 2024, 4:20 PM IST

ETV Bharat / Videos

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నీళ్లు కలిపిన పెట్రోల్​ - వాహనదారుల ఆందోళన

Water Mixed With Petrol In Siddipet : పెట్రోల్ కల్తీ గురించి మనం తరచూ చూస్తూనే ఉంటాం. పెట్రోల్​లో కిరోసిన్ కలపడం సహజమే కానీ ఏకంగా నీళ్లు కలపడం మాత్రం చాలా అరుదే. ఇలాంటి అరుదైన ఘటన సిద్ధిపేటలో జరిగింది. నీళ్లు కలిపిన పెట్రోల్​ పోయించుకున్న వాహనాలు మొరాయించడంతో మెకానిక్​ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. 

వంద దాటిన పెట్రోల్​ ధరలతో జనం బెంబేలెత్తిపోతుంటే దానికి కల్తీ పెట్రోల్​ కూడా తోడు అయింది. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్​లో పెట్రోల్​లో నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆందోళనకు దిగారు. రూ.300ల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికి వెళ్లేసరికే బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకుపోతే ఆయనకు అసలు విషయం తెలిసింది. జిల్లా కేంద్రంలోని ఈ పెట్రోల్ పంప్​లో వాటర్ రావడం తరచుగా జరుగుతుందని, ఆ బంకుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పెట్రోల్​ను పరీక్షలకు పంపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.