నా 'పద్మవిభూషణ్' రైతులు, మహిళలు, యువతకు అంకితం : వెంకయ్యనాయుడు - పద్మవిభూషణ్ వెంకయ్య నాయుడు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-01-2024/640-480-20597135-thumbnail-16x9-venkaiah-naidu.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jan 26, 2024, 12:19 PM IST
Venkaiah Naidu Padma Vibhushan 2024 : దేశ ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన ప్రశంసించారు. ప్రపంచ దేశాలన్ని భారతదేశం వైపే చూస్తున్నాయని వెంకయ్యనాయుడు అన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతలను మరింత పెంచిందన్నారు. వాటిని చిత్తశుద్దితో నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనకు లభించిన అవార్డును రైతులు, మహిళలు, యువతకు అంకితమిస్తున్నానని చెప్పారు.
రాజకీయాలు పక్కనపెట్టి దేశాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. రాజకీయ జీవితంలో అనేక పదవులు నిర్వహించానని గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశానని పేర్కొన్నారు. 75 ఏళ్ల జీవితంలో 46 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటూ సేవ చేశానన్నారు. ఎమ్మెల్యే బీజేపీ కేంద్ర, రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రి, ఉపరాష్ట్రపతిగా విభిన్న హోదాల్లో పనిచేసిన విషయం తెలిసిందే.