రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 7, 2024, 12:22 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2024/640-480-20687708-thumbnail-16x9-two-persons-died-in-road-accident-at-nuzvid-national-highway.jpg)
Two Persons Died in Road Accident: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట నుంచి నూజివీడు వెళ్లే రహదారిలో రాణి కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కైకలూరు నుంచి దిల్లీకి చేపలలోడుతో వెళుతున్న లారీ, బైకుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Accident at Nuzvid National Highway: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేట నుంచి నూజివీడు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కోలా మల్లికార్జునరావు (24), మాణికల విజయ్ బాబు (26) విస్సన్నపేట మండలం కొండపర్వ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరగడానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణామేమో అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవెేళ ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారు మద్యం సేవించి వాహనాన్ని నడిపి ఉండచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.