thumbnail

ఎగ్‌ పఫ్‌లకే రూ.3.5 కోట్లు మింగేసిన జగన్ - వరద సాయం వైఎస్సార్సీపీ ముఠా ఫేక్ ప్రచారం : పట్టాభి

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

TDP Leader Kommareddy Pattabhiram Fire on YSRCP Fake Publicity : వరద బాధితులకు ప్రభుత్వం అందించిన సాయంపై మాజీ సీఎం జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం 203.3కోట్లు వరద సాయంగా ఖర్చు చేస్తే జగన్ రెడ్డి తన పత్రికలో '534 కోట్లు మింగేశారంటూ' తప్పడు రాతలు రాయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. వరద సమయంలో భోజన ప్యాకెట్లకు 54.5 కోట్లు ఖర్చు చేస్తే 368 కోట్లు అవినీతి చేశారని ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. శానిటేషన్​లో 51 కోట్లు దుబారా చేశారంటున్న జగన్ ముఠా, అసలు మొత్తంగా ఖర్చు చేసింది 18 కోట్ల మాత్రమే అన్న విషయం గుర్తించాలన్నారు. 

జగన్ రెడ్డి లా ఎగ్ పఫ్​లకు 3.5 కోట్లు, సర్వే రాళ్లపై బొమ్మలు వేయడానికి 700 కోట్లు, ప్రచార పిచ్చికి దుబారా చేసే నైజం నేటి ఎన్డీయే ప్రభుత్వానిది కాదని స్పష్టం చేశారు. నేటి వరకు తన సొంత నిధులతో ఒక్క వాటర్ బాటిల్ కూడా వరద బాధితులకు అందించని జగన్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని నిలదీశారు. ఊరికో ప్యాలెస్ కట్టుకుని కష్టాల్లో ఉన్న ప్రజలును పరామర్శించడానికి సైతం రెడ్ కార్పెట్లు వేయంచుకున్న జగన్‌ చరిత్ర అందరికి తెలుసని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు నడుములోతు బురద నీళ్లలో ప్రతి ఇంటి గడప వద్దకు వెళ్లి అండగా ఉన్నానని ధైర్యం చెప్పారని గుర్తు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.