LIVE:కుప్పం అభివృద్ధి అటకెక్కించి అబద్దపు ప్రచారాలు చేస్తున్న జగన్ రెడ్డి - దేవినేని మీడియా సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 2:20 PM IST

Updated : Feb 26, 2024, 2:39 PM IST

thumbnail

TDP Devineni Press Meet Live: అభివృద్ధిని అటకెక్కించిన సీఎం జగన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ మాజి మంత్రి బోండా ఉమా మండిపడ్డారు. టీడీపీ పాలనలోనే కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఉమా పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం అన్ని విధాల వెనుకబడి ఉండటంతో పాటు అనధికార ఏజెన్సీగా ఉన్న ప్రాంతాన్ని సీఎంగా చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో గుర్తింపు తీసుకువచ్చారని ఉమా కొనియాడారు. ద్రావిడ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్‌ కళాశాల, మెడికల్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇజ్రాయేల్‌ దేశ పరిజ్ఞానంతో వ్యవసాయం, బిందుసేద్యం, పాలీహౌస్‌, గ్రీన్‌హౌస్‌ తదితర వాటిని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశారని తెలిపారు. టీడీపీ హయాంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తుంటే కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని సీఎం జగన్‌ పేర్కొనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బొండా ఉమా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం. 

Last Updated : Feb 26, 2024, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.