thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 4:33 PM IST

Updated : Jul 24, 2024, 5:04 PM IST

ETV Bharat / Videos

'జగన్​ నిన్ను దిల్లీలో ఎవరూ పట్టించుకోరు' - Subbarao Protest Against Jagan

Subba Rao Gupta Protest Against Jagan in Ongole : దిల్లీలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్​ ధర్నాని నిరసిస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ రెబల్ నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారావు గుప్తా ఆందోళనకు దిగారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే జగన్ దిల్లీలో ధర్నా చేయడాన్ని సుబ్బారావు గుప్తా తప్పుపట్టారు. బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని, దళితుడైన డాక్టర్ సుధాకర్ ని, ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్​ని చంపినప్పుడు జగన్ దిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదని సుబ్బారావు గుప్తా ప్రశ్నించారు. జగన్ తన పద్ధతి మార్చుకోకపోతే సింగిల్ డిజిట్​తో మిగిలిపోతాడని సుబ్బారావు గుప్తా హెచ్చరించారు. 
తన హయాంలో వందలాది దళితులు హత్యకు గురైనప్పుడు ఏం చేశారని మండిపడ్డారు. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున అప్పుడు మీరు స్పందించలేదనుకున్నా, మీ బాబాయి హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఉందిగా అప్పుడు దీక్ష ఎందుకు చెయ్యలేదని ధ్వజమెత్తారు. దిల్లీలో నిన్నెవరూ పట్టించుకోరు జగన్​ అని సుబ్బారావు హితవు పలికారు. 

Last Updated : Jul 24, 2024, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.