LIVE : సబ్ ఇన్​స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్​లో పాల్గొన్న సీఎం రేవంత్​ - SI Passing Out Parade Live

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 9:56 AM IST

Updated : Sep 11, 2024, 11:51 AM IST

thumbnail
CM Revanth in Police Passing Out Parade Live : తెలంగాణ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్​స్పెక్టర్ల మూడో బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ​జరుగుతోంది. పోలీస్ అకాడమీలోని సుదర్శన్ గ్రౌండ్​లో జరుగుతున్న ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సబ్ ఇన్​స్పెక్టర్ల భర్తీ మూడుసార్లు జరిగాయి. ప్రస్తుతం మూడో బ్యాచ్ శిక్షణ పూర్తైంది. 2023 బ్యాచ్​కు చెందిన వీరికి 9 నెలల పాటు జరిగిన ట్రైనింగ్ ఇచ్చారు. వీరి​లో టాప్ ర్యాంక్​లో నిలిచిన వారికి ముఖ్యమంత్రి బహుమతులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్ ఉన్నతాధికారులు, అకాడమీ సిబ్బంది, శిక్షణ పొందిన సబ్ ఇన్​స్పెక్టర్ల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఎస్సై ఆపై స్థాయి అంటే గ్రూప్‌-1 ద్వారా ఎంపికైన డీఎస్పీలకు శిక్షణ ఇస్తారు. ఈ బ్యాచ్​లో మొత్తం 547 మంది ఎస్సైలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వీరిలో  145 మంది మహిళా ఎస్​ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. వీరిలో సివిల్‌ ఎస్​ఐలు 401 మంది. పరేడ్ కమాండర్ గా మహిళా ఎస్​ఐ పల్లి భాగ్యశ్రీ వ్యవహరించారు.
Last Updated : Sep 11, 2024, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.