విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలి : మంత్రి నారా లోకేశ్ - Teachers Unions Meet Lokesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 9:54 PM IST

thumbnail
లోకేశ్​ను కలిసిన విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నేతలు (ETV Bharat)

Teachers Unions Leaders Meet Nara Lokesh : రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సచివాలయంలో మంత్రి నారా లోకేశ్​ను కలిశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యాప్రమాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని లోకేశ్​ విమర్శించారు.

Minister Lokesh on Education Department : మళ్లీ విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని మంత్రి లోకేశ్​ కోరారు. గతంలో మాదిరి ఉపాధ్యాయులపై అనవసరమైన పనిభారం, వేధింపులు ఉండవని తెలిపారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి​ భరోసా ఇచ్చారు. అంతకుముందు లోకేశ్​ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖలమంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలను పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ మొదటి సంతకం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.