ఉత్తర భారతానికి వెళ్తే ఏ భాషలో మాట్లాడతారో కేటీఆరే చెప్పాలి : రాజాసింగ్ - MLA Raja Singh Fires On KTR
Published : Sep 13, 2024, 2:54 PM IST
MLA Raja Singh Fires On KTR : మాజీ మంత్రి కేటీఆర్ హిందీ భాషను తమపైన ఎందుకు రుద్దుతున్నారని, అమిత్ షాను ప్రశ్నిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్తే కేటీఆర్ ఏ భాషలో మాట్లాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లకు మన భాష అర్థమవుతుందా అని అడిగారు. హిందీ భాష నేర్చుకుంటే యావత్ దేశంలో ఎక్కడికి వెళ్లినా హిందీలో మాట్లాడవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చన్నది అమిత్ షా ఉద్దేశం అని స్పష్టం చేశారు.
కేటీఆర్ అధికారం కోల్పోయి ఖాళీగా ఉన్నారని, అందుకే ప్రసారమాధ్యమాల్లో ఉండాలనే ఆలోచనతో అమిత్ షాను విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కేసీఆర్ ఏ భాషలో మాట్లాడారో కేటీఆర్ అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర మంత్రులను కలిసినప్పుడు ఏ భాషలో మాట్లాడారో మరిచిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్కు హిందీ రాకపోతే తెలంగాణ గురించి మోదీకి ఏ విధంగా వివరించేవారు, ఏ భాషలో తెలంగాణకు నిధులు అడిగేవారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.