ఈ లైన్​మెన్​కు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే - తాడుపై నడుస్తూ వాగు దాటి - విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించి - LINEMAN WALKING WIRES

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 6:28 PM IST

thumbnail
వాగును దాటేందుకు లైన్​మెన్​ సాహసం - వెలువెత్తుతున్న ప్రశంసలు (ETV Bharat)

Power Staff Cross Surging Stream to Restore Electricity In AP : ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం నూరుపూడి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ప్రమాదకరమైన వాగును దాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ లైనుకు సమస్య తలెత్తడంతో అక్కడ పని చేస్తున్న లైన్​మెన్ రాము తాడుపై నడుస్తూ వాగును దాటారు. ఈ మార్గంలో పెద్ద కొండవాగు ప్రస్తుత వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు వంతెన లేకపోవడంతో అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో అటు ఇటు చెట్లకు తాడును కట్టి లైన్​మెన్ సాహసం చేసి సరఫరాను పునరుద్ధరించారు. 

గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాగును దాటేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు వంతెన నిర్మించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు తాడు సాయంతో వాగు దాటుతున్నారు. లైన్​మెన్  చేసిన సాహసానికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. అదే విధంగా వంతెన నిర్మాణానికి అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.