Telangana Tourism Hyderabad One Day Tour : చారిత్రక కట్టడాలు, పురాతన ప్యాలెస్లు, రాచరికానికి అద్దం పట్టే కోటలు, రుచికరమైన బిర్యానీ, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్లో లేనిదంటూ ఏదీ లేదు. అందుకే చాలా మంది వీలు కుదిరినప్పుడల్లా వీటిని విజిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా హైదరాబాద్లోని ఫేమస్ ప్లేసులను చూడాలనుకుంటున్నారా? వీకెండ్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్న్యూస్ చెబుతోంది తెలంగాణ టూరిజం. అతి తక్కువ ధరకే ఒక్కరోజులోనే సిటీ మొత్తం కవర్ చేసేలా ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ టూరిజం హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ పేరుతో ఈ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో బిర్లా మందిర్, చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్లో షాపింగ్ సహా ఇతర ప్రదేశాలు ఎంజాయ్ చేయవచ్చు. ఏసీ, నాన్ఏసీ బస్సుల ద్వారా ప్రయాణం ఉంటుంది.
ప్రయాణ వివరాలు:
- ఉదయం 7:30 గంటలకు సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట యాత్రి నివాస్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది.
- 7:45 గంటలకు పర్యాటక భవన్ దగ్గర ఎక్కొచ్చు.
- 8:15 గంటలకు బషీర్బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా బోర్డింగ్ పాయింట్ ఉంటుంది.
- బషీర్బాగ్ నుంచి జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ముందుగా బిర్లా మందిర్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
- ఆ తర్వాత చౌమహాల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీద్ విజిట్ చేస్తారు.
- అక్కడి నుంచి లాల్ బజార్లో షాపింగ్ చేయడానికి కాస్త టైమ్ ఇస్తారు.
- సాలార్జంగ్ మ్యూజియం విజిట్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది.
- మధ్యాహ్నం భోజనం తర్వాత నిజాం మ్యూజియం వెళ్తారు. అనంతరం గోల్కొండ కోటను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తారు.
- ఆ తర్వాత కుతుబ్ షాహీ టూంబ్స్ విజిట్ చేస్తారు. అనంతరం ఐమ్యాక్స్(ఖైరతాబాద్) మీదుగా చివరగా లుంబినీ పార్క్ దగ్గర రాత్రి 7:30 గంటలకు వదిలేస్తారు. దీంతో మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.
శుక్రవారం వెళ్తే వీటిని చూడలేరు: ఈ వన్ డే ట్రిప్ ప్రతిరోజూ ఉంటుంది. కానీ శుక్రవారం రోజున వెళ్తే నగరంలోని అన్ని మ్యూజియమ్స్ను చూడలేరు. ఎందుకంటే ఆరోజున చౌమహాల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం మూసి ఉంటాయి. అయితే ఈ శుక్రవారం రోజున మ్యూజియమ్స్కు బదులు నెహ్రూ జూ లాజికల్ పార్కును సందర్శించొచ్చు.
ధరలు: హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్లో భాగంగా ఏసీ, నాన్ ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏసీ బస్సులో పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చెల్లించాలి. అదే నాన్ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ.380, చిన్న పిల్లలకు రూ.300 చెల్లించాలి. అయితే ఫుడ్, సందర్శన స్థలాల వద్ద ఎంట్రీ టికెట్లు పర్యాటకులే చూసుకోవాలి. ఈ టూర్ ప్యాకేజీ పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
ఒకే ట్రిప్లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ!
తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ - ఒకేరోజు పంచారామాల దర్శనం - ధర కూడా తక్కువే!