పొదుపు సంఘం సభ్యుల ఇళ్లలో లీడర్ చోరీ- కిలాడీ లేడీ టాలెంట్కు దొంగలు కూడా షాక్ అవ్వాల్సిందే - Police Arrest Thief Recovered gold - POLICE ARREST THIEF RECOVERED GOLD
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 10:35 AM IST
Police Arrest Thief Recovered Huge Gold in Proddatur : రుణాల పేరుతో బురిడీ కొట్టించి మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేసి, రూ.22.32 లక్షలు విలువైన 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ప్రొద్దుటూరు పట్టణంలోని మౌలానా ఆజాద్ వీధి-2కు చెందిన జహరాతాజ్ పొదుపు సంఘం గ్రూపు లీడర్గా పనిచేస్తోంది. గ్రూపు సభ్యుల ఇళ్లలో బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి వాటిని చోరీ చేయాలని పక్కా ప్రణాళిక వేసింది. ఈ క్రమంలో రుణాలు ఇప్పిస్తానని ఆశచూపి మహిళలను ఇంటి వద్దకు రప్పించుకుని, మాటలు కలిపి వారి హ్యాండ్ బ్యాగులో ఉన్న ఇంటి తాళాలు తీసుకునేది. వారిని అక్కడే ఉంచి, రుణం గురించి మాట్లాడి వస్తానని నేరుగా బాధితుల ఇంటికి వెళ్లి తాళాలను తీసి బీరువాలో ఉన్న బంగారం ఆభరణాలను చోరీ చేసింది.
ఈ విధంగా మౌలానా ఆజాద్ వీధిలోని రెండు ఇళ్లు, కేహెచ్ఎం వీధిలోని మరో ఇంట్లో దొంగ తనాలు చేసి మొత్తం 35 తులాల బంగారు ఆభరణాలు అపహరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలించిన నగలను కరిగించి ఆభరణాలు తయారు చేయించేందుకు నెల్లూరు వెళ్తుండగా నిందితురాలిని పోలీసులు పట్టుకున్నారు.