LIVE : నారాయణపేట బహిరంగ సభలో ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - PM Modi Election Campaign Live - PM MODI ELECTION CAMPAIGN LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-05-2024/640-480-21431894-thumbnail-16x9-modi.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 10, 2024, 3:46 PM IST
|Updated : May 10, 2024, 4:19 PM IST
PM Modi Live : ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో రెండంకెల స్థానాలు గెలవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తూ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని తీసుకువస్తున్నారు. అలాగే బీజేపీ కేంద్ర అధినాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న దగ్గర నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి ప్రముఖులు తెలంగాణలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా రెండంకెల సీట్లకు తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నారు. అందులో భాగంగా నేడు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చారు. మహబూబ్నగర్ బీజేపీ లోక్సభ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభకు విచ్చేశారు. భారీ జనసమీకరణ చేసిన బీజేపీ అధిష్ఠానం, మళ్లీ దేశంలో మోదీ రావాలని కోరుతున్నారు.
Last Updated : May 10, 2024, 4:19 PM IST