thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 6:00 PM IST

ETV Bharat / Videos

శిలాఫలకంపై లేని ఎమ్మెల్యే పేరు - ఆనం అభిమానుల ఆగ్రహం

Officials Ignored MLA Name on Inauguration Plaque in Venkatagiri : తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకంపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇందుకు పురపాలక సంఘం అధికారులు ప్రొటోకాల్​ను విస్మరించడమే కారణం అంటూ ఆనం అభిమానులు మండిపడ్డారు. ఈ రోజు (మంగళవారం) స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్​ కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో రూ.7 కోట్ల వ్యయంతో గడప గడప కోటాలో చేసిన వివిధ అభివృద్ధి పనుల శిలఫలకాన్ని ప్రారంభించారు.

అయితే ఆ శిలఫలకంపై ఎక్కడ కూడా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పేరు కనిపించలేదు. అధికార పదవులు కల్గిన అందరి పేర్లతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, నామినేట్​ పదవుల్లో ఉన్న వారి పేర్లను కూడా రాయించిన పురపాలక అధికారులు ఆయన పేరు మాత్రం విస్మరించారు. వైసీపీకి దూరమై టీడీపీలో చేరినందుకే ఎమ్మెల్యే పేరు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.