అభివృద్ధి అంటే చంద్రబాబు, జగన్ అంటే విధ్వంసం : టీడీపీ నేత నెట్టెం రఘురాం - ntr district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-02-2024/640-480-20786764-thumbnail-16x9-raghu-ram-comments.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 3:33 PM IST
Nettem Raghuram Comment on CM Jagan : అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు, విధ్వంసానికి ప్రతిరూపం సీఎం జగన్ అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం వ్యాఖ్యానించారు. ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను పెత్తందారులు అని విమర్శిస్తే అది నిజం అవుతుందా అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అయితే పెత్తందారులు ప్రతిపక్షనాయకులు ఎలా అవుతారని విమర్శించారు. మేలు చేసేవారు ఎవరో, దోపిడీ చేసేవారు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు.
సీఎం జగన్ రాప్తాడు సిద్ధం సభలో మాట్లాడిన ప్రతి మాట అబద్ధమని నెట్టెం రఘురామ్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్ల అన్యాయాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలతో రాజ్యం ఏలుతున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్ల కాలంలో పేద ప్రజల్ని పట్టించులేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా అడ్డుకట్ట వేశారని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఇంటికి పంపించాడని ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.