By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 1:44 PM IST
|Updated : Mar 8, 2024, 2:45 PM IST
LIVE: కదిరి శంఖారావం సభలో నారా లోకేశ్- ప్రత్యక్షప్రసారం
Nara Lokesh Sankharavam Sabha in Kadiri Live: రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం అయ్యాయి. గురువారం నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించారు. ప్రస్తుతం పెనుకొండ సభల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం కదిరిలో నారా లోకేశ్ 'శంఖారావం' సభల్లో పాల్గొంటారు. అంతకుముందు పుట్టపర్తి నియోజకవర్గంలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన రూ.25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. హిందూపురంలో నిర్వహించిన శంఖారావం సభలో నారా లోకేశ్ మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాగా ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం ప్రత్యక్షప్రసారం మీ కోసం..
Last Updated : Mar 8, 2024, 2:45 PM IST