రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతం : జీవన్ రెడ్డి - Jeevan Reddyabout BJP Yatra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-02-2024/640-480-20852955-thumbnail-16x9-mlc.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 27, 2024, 3:59 PM IST
MLC Jeevan Reddy About Modi : బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్పై విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాముడికి, మోదీకి ఏం సంబంధముందని ప్రశ్నించారు. గుడిలో రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతమని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆక్షేపించారు.
MLC Jeevan Reddy Comments on BJP : వికసిత్ భారత్ పెట్టుబడిదారుల కోసమేనని, అంబానీ, అదానీ కోసం వికసిత్ భారత్ తీసుకువచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారంటున్నారని, అంబానీ, అదానీకి లోన్లు రుణమాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాతృమూర్తిపై అనుచితంగా మాట్లాడిన సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.