thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 18, 2024, 12:02 PM IST

Updated : Jul 18, 2024, 1:19 PM IST

ETV Bharat / Videos

LIVE: నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - ANAM RAMANARAYANA REDDY PRESS MEET

ANAM RAMANARAYANA REDDY PRESS MEET: నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా జరిగిన భూ కుంభ కోణాలపై విచారణ జరిపి, బాధ్యులపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కూటని నేతలు తెలిపారు. ఎసైన్డ్‌ భూములను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఈ దందాలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని, ఈ కుట్రలో అధికారులు ఉన్నా, రాజకీయ నేతలు ఉన్నా వదలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్, భూముల రీ-సర్వే నిర్వహణ, పేదలకు ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు, లబ్ధిదారులను మోసగించారని మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్​ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే, సీఎం హోదాలో రెడో సంతకమే ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదించారు.  రైతుల భూములపై హక్కులను లాక్కునే ఈ చట్టం రద్దును అంతా స్వాగతించారు. ప్రస్తుతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్​పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. అదే విధంగా ఎంపీ విజయసాయిరెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ప్రత్యక్షప్రసారం
Last Updated : Jul 18, 2024, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.