thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

ETV Bharat / Videos

LIVE : అలిపిరి నుంచి తిరుమలకు పవన్​కల్యాణ్​ కాలి నడక - ప్రత్యక్ష ప్రసారం - Deputy Chief Minister Pawan Kalyan

Deputy Chief Minister Pawan Kalyan in Tirumala LIVE : ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్న  పవన్ కల్యాణ్‌ తిరుమల బయల్దేరారు. ​అలిపిరి నుంచి కాలి నడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అలిపిరి పాదాల వద్దకు పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు, పవన్​ అభిమానులు చేరుకున్నారు.లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కేవలం తేదీ విషయంలోనే వివాదం ఉందన్నారు. నేడు తిరుమల చేరుకున్న పవన్​ రెండో తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు.  మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో జరిగే వారాహి బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా కాలి నడకన తిరుమల కొండ ఎక్కుతున్న ఉపముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం మీకోసం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.