LIVE : తెలంగాణ భవన్​లో పూలే జయంతి వేడుకలు - phule jayanti celebrations

By ETV Bharat Telangana Team

Published : Apr 11, 2024, 11:38 AM IST

Updated : Apr 11, 2024, 11:49 AM IST

thumbnail

Mahatma Jyotiba Phule Jayanti Celebrations in Telangana Bhavan : మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పూలే జయంతి వేడుకలను బీఆర్​ఎస్​ పార్టీ తెలంగాణ భవన్​లో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్​, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.1827వ సంవత్సరం ఏప్రిల్​ 11న మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిబా పూలే, అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణకు ఎంతగానో కృషి చేశారు. దిగువ కులాల ప్రజలకు సత్యశోధక్​ సమాజ్​ను ఏర్పాటు చేశారు. ఈయన భార్య సావిత్ర బాయి పూలే కూడా మహిళా విద్యకు పెద్దపీట వేశారు. భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసిన భారతీయులుగా వీరు గుర్తింపు సాధించారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ ప్రభుత్వం పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో ఓటమి చవిచూడడంతో పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్​లోనే వేడుకలను నిర్వహించుకుంటున్నారు.

Last Updated : Apr 11, 2024, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.