త్వరలో చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితమిస్తారు : కిషన్ రెడ్డి - Charlapalli Terminal in Hyderabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 1:39 PM IST

Kishan Reddy At Secunderabad Railway Station : గతేడాది ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునః నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2025 ఏడాది చివరికి పనులు పూర్తవుతాయని వెల్లడించారు. విమానాశ్రయం తరహాలో ఈ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోందని వివరించారు. చర్లపల్లి కొత్త టెర్మినల్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు.

Charlapalli Terminal in Hyderabad : "ఈ రైల్వే స్టేషన్‌లో 25 లిఫ్టులు, 32 ఎస్కలెటర్లు ఈ స్టేషన్‌లో అందుబాటులోకి వస్తాయి. మెట్రో, ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉండేలా స్టేషన్‌ను అనుసంధానం చేస్తున్నాం. పరిసర ప్రాంతాల్లో అందమైన నిర్మాణాలు చేపడుతున్నాం. ప్రధాని మోదీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కచ్చితంగా అమలు చేస్తారు. క్యాంటీన్, రీక్రియేషన్, రిటైల్ షాపులు, కెఫెటేరియా, ఇతర వసతులు కూడా అందుబాటులోకి వస్తాయి. 2025లో కూడా నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు. మరోసారి ప్రధాని హోదాలో ఆయన ఇక్కడికి వచ్చి ఈ స్టేషన్‌ను సందర్శిస్తారు." అని కిషన్ రెడ్డి తెలిపారు 

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. కొమురవెల్లి మల్లన్న వద్ద నూతన స్టేషన్ రాబోతుందని చెప్పారు. దానికి ఫిబ్రవరిలో భూమి పూజ చేస్తామని వెల్లడించారు. ఈ నెల లేదా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి టెర్మినల్‌ను జాతికి అంకితం చేస్తారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా కేంద్ర రైల్వే శాఖ పనులు చేపడుతోందని వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.