ఎన్నికల సిత్రం - ఖమ్మం టీడీపీ కార్యాలయంలో నామ నాగేశ్వరరావు - BRS tdp Alliance in Khammam

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 3:20 PM IST

thumbnail
ఎన్నికల సిత్రం - ఖమ్మంలో బీఆర్​ఎస్​ టీడీపీ కూటమి (ETV Bharat)

Khammam BRS Candidate Requested TDP For Alliance : కాంగ్రెస్​ హయాంలో ఆకలి చావులు చూసిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ స్థాపించి కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారని ఖమ్మం బీఆర్ఎస్ లోక్​సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యకర్తల మద్దతు కోరారు. తనకు మద్దతు ఇస్తే కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్​కు భారత రత్న ఇవ్వాలని టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. స్వయంగా ఉత్తరం పూరించి రాష్ట్రపతికి పోస్టు చేశారు. టీడీపీ ఎన్టీఏ కూటమిలో ఉన్నందుకు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం తెలిపారు.  

రాష్ట్రంలో బీఆర్​ఎస్​ నాయకులు ప్రచార జోరును పెంచారు. అధికార పార్టీ హామీల అమలు విఫలాన్ని ఆయుధంగా చేసుకుని ప్రచారాం చేస్తున్నారప. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఆరోపిస్తూ బీఆర్​ఎస్​కు ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.