'హైడ్రా కూల్చివేతలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయి' - SAMBASHIVA RAO HOT COMMENTS HYDRA - SAMBASHIVA RAO HOT COMMENTS HYDRA
🎬 Watch Now: Feature Video


Published : Oct 1, 2024, 5:32 PM IST
Sambashiva Rao Hot comments On Hydra: హైడ్రా పేరు వింటేనే హైదరాబాద్ వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై శ్వేత పత్రం విడుదల చేసిన తరువాత కూల్చివేతలు చేస్తే బాగుండేదని అన్నారు. హైడ్రాను హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయాలని మిగితా జిల్లాలకు విస్తరిస్తే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని సూచించారు. హైడ్రా కూల్చివేతలతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
పేదల గుడిసెలు, ఇళ్ల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని చెప్పిన ఆయన, హైడ్రాను ఎత్తివేస్తే రాష్ట్రంలో కబ్జారాయుళ్ల ఆగడాలు సైతం పెరుగుతాయని అన్నారు. డిసెంబర్ చివరి వారంలో సీపీఐ జాతీయ సభలను ఖమ్మంలో 5 లక్షల మందితో నిర్వహిస్తామని తెలిపారు. అంతకు ముందు వరంగల్ నగరంలోని ఓ వేడుకల మందిరంలో పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.