డబ్బుల కోసం భార్య గొంతు కోసి హత్య- తల్లిని కోల్పోయిన తొమ్మిది నెలల చిన్నారి - Husband Killed Wife For Money - HUSBAND KILLED WIFE FOR MONEY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-07-2024/640-480-21962841-thumbnail-16x9-husband-killed-wife-for-money-in-anantapur-district.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 10:33 AM IST
Husband Killed Wife For Money in Anantapur District : డబ్బుల కోసం భార్య గొంతు కోసి హత్య చేశాడో భర్త. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పాతగుంతకల్లుకు చెందిన పులికొండ అనే వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని నిందితుడు నిత్యం భార్యను వేధించేవాడని సమాచారం. కొంతకాలంగా ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే 50 వేల రూపాయలు కావాలని సోమవారం రాత్రి నిందితుడు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు లేవని భార్య చెప్పడంతో సెల్ఫోన్ ఛార్జర్ వైరును గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం వారి 9 నెలల కుమార్తెతో పరారవుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్షణికావేశంలో భార్యను చంపిన, అతను నింధితుడిగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు, ఇప్పుడు పాప పరిస్థితి ఏంటని స్థానికులు ఆవేదన చెందారు.