thumbnail

టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణుల కదనోత్సాహం - దారులన్నీ బొప్పూడి ప్రజాగళం సభ వైపే

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 5:04 PM IST

Updated : Mar 17, 2024, 7:48 PM IST

Huge number of TDP BJP and Janasena Workers Attending Praja Galam Meeting : పల్నాడు జిల్లా బొప్పూడి జనసందోహంగా మారింది. టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి సభ కోసం జనం పెద్ద ఎత్తున చేరుకున్నారు. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వేల సంఖ్యలో ప్రజాగళం సభకు వాహనాలు చేరుకున్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి వస్తుండటంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ప్రజాగళం బహిరంగ సభకు వెళ్లే వేలాది వాహనాలతో జాతీయ రహదారి కోలాహలంగా మారింది.  కూటమి పంతం - వైఎస్సార్సీపీ అంతం అంటూ నినాదాలు చేసుకుంటా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

Praja Galam Meeting in Chilakaluripeta : తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి వస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి చిలకలూరిపేటకు ఆర్టీసీ, ప్రైవేట్, విద్యా సంస్థల బస్సులు, లారీలు, ట్రక్కులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో వేలాది మంది ఉత్సాహంతో సభకు వస్తున్నారు. దారులన్నీ బొప్పూడి సభ వద్దకే అనే మాదిరిగా కోలాహలం నెలకొంది. మహిళలు సైతం భారీగా తరలివస్తున్నారు. జాతీయ రహదారి వెంట తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పెక్సీలు  శ్రేణులకు స్వాగతం పలికాయి. కలకత్తా-చెన్నై జాతీయ రహదారిపై అభిమానులు కోలాహలంగా బహిరంగ సభకు బయలుదేరారు. 

Last Updated : Mar 17, 2024, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.