యాదాద్రిలో భక్తుల రద్దీ - ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం - RUSH IN YADADRI TEMPLE

By ETV Bharat Telangana Team

Published : Jun 30, 2024, 12:54 PM IST

thumbnail
యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ - ఉచిత దర్శనానికి రెండు గంటలు (ETV Bharat)

Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇవాళ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయంలో మొక్కు కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు తగిన చర్యలు చేపట్టారు.  

ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండకింద భాగంలో విష్ణుపుష్కరిణి, కారు పార్కింగ్, బస్​స్టాండ్​లో భక్తుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్​ సమస్యలు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.