అందుబాటులోకి మరో పైవంతెన - రేపు సీఎం చేతుల మీదుగా గోపన్​పల్లి ఫ్లై ఓవర్​ ప్రారంభం - Gopanpally Flyover inaugurate

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 7:25 PM IST

thumbnail
రేపు సీఎం చేతులు మీదగా గోపన్​పల్లి ఫ్లైఓవర్​ ప్రారంభం (ETV Bharat)

Gopanpally Flyover in Hyderabad : ట్రాఫిక్​ సమస్య నుంచి నగరవాసులను గట్టెక్కించేందుకు హైదరాబాద్​లో నిర్మించిన పైవంతెనలు దాదాపుగా అందుబాటులోకి వచ్చాయి. నగర శివారు ఐటీ కారిడార్​లోని గోపన్​పల్లి తండా వంతెనను ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి శనివారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు రూ.28 కోట్ల వ్యయంతో వై ఆకారంలో నిర్మించిన ఆ వంతెనతో గచ్చిబౌలికి వెళ్లే ఐటీ ఉద్యోగులతో పాటు గోపన్​పల్లి, తెల్లాపూర్​, నల్లగండ్ల, కొల్లూరు వాసుల ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. 

రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో పీవీరావ్ నిర్మాణ సంస్థ ఈ వంతెన నిర్మాణం చేపట్టింది. వై ఆకారంలో ఒకవైపు వెళ్లేందుకు మాత్రమే వీలుండే విధంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. గోపన్​పల్లి నుంచి వట్టినాగులపల్లి ఓఆర్ఆర్​లో కలిసే రేడియల్ రోడ్డుపై తండా జంక్షన్ వద్ద ఈ వంతెన నిర్మించారు. ఈ విషయంపై వంతెనను ఎప్పుడు ప్రారంభిస్తారంటూ బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సైతం 10 రోజుల క్రితం ఎక్స్​ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో రేపు సీఎం రేవంత్​ రెడ్డి గోపన్​పల్లి తండా పైవంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.