LIVE : రామోజీ ఫిల్మ్​సిటీలో​ 'ఈనాడు స్వర్ణోత్సవ' సంబురం - Eenadu Golden Jubilee Celebrations

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 2:16 PM IST

Updated : Aug 10, 2024, 5:34 PM IST

thumbnail
Eenadu Golden Jubilee Celebration Live : ఐదు దశాబ్దాల క్రితం విశాఖ తీరాన పురుడుపోసుకున్న ఈనాడు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగి అశేష పాఠకుల హృదయాల్లో గూడు కట్టుకుంది. అక్షరయోధుడు రామోజీరావు ఆలోచనల నుంచి 1974 ఆగస్టు 10న విశాఖ వేదికగా పుట్టిన ఈనాడు పత్రిక అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలు చూరగొని అగ్రస్థానానికి చేరుకుంది. నాటి నుంచి నేటి వరకు విశేష వార్తలు, కథనాలను అందిస్తూ పాఠకుల మనస్సుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. కచ్చితత్వం, ప్రజాప్రయోజనం, విశ్వసనీయత, వృత్తి నిబంధన, సత్యనిష్ఠ ఈ ఐదు సూత్రాలను గతి తప్పకుండా పాటించడం వల్లే ఈనాడు ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని సగర్వంగా పూర్తి చేయగలిగింది. ఈనాడును చదివాకే రోజును ప్రారంభించడం అలవాటుగా చేసుకున్న వారెందరో. ఉదయాన్నే శుభోదయం అంటూ తెలుగు లోగిళ్ల తలుపు తట్టే ఈనాడు ఇవాళ్టితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ స్వర్ణోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో ఈనాడు సంస్థ స్వర్ణోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుక ప్రత్యక్ష ప్రసారం మీ కోసం.
Last Updated : Aug 10, 2024, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.