LIVE : ఎమ్మెల్యే మధుసూదన్​ రెడ్డి కుటుంబానికి సీఎం రేవంత్​ పరామర్శ - CM Revanth Visit Chintalakunta live

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2024, 1:09 PM IST

Updated : Sep 15, 2024, 1:14 PM IST

thumbnail
CM Revanth Reddy Visit to Chintalakunta Live : మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్​ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి మరణించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం దమగ్నాపుర్​ నివాసంలో కన్నుమూశారు. ఆయన మృతికి కాంగ్రెస్​ శ్రేణులు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.      చిన్నచింతకుంట మండలం దమగ్నపూర్​లో నిర్వహించే కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్​తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. హెలిప్యాడ్​ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్​ రెడ్డికి స్థానిక నేతలు సాదరంగా ఆహ్వానం పలికారు. నేరుగా ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న రేవంత్​ రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో దేవరకద్రలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 
Last Updated : Sep 15, 2024, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.