LIVE : నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి - CM REVANTH REDDY LIVE - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-05-2024/640-480-21417872-thumbnail-16x9-cm-revanth.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : May 8, 2024, 7:14 PM IST
|Updated : May 8, 2024, 9:41 PM IST
CM Revanth Live : తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఆ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. హస్తం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయా జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ రోడ్షో అనంతరం నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీకార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాంగ్రెస్ గ్యారంటీల గురించి విమర్శించే నైతికహక్కు లేదని రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు.
Last Updated : May 8, 2024, 9:41 PM IST