సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కళాశాలను - సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు తన్నుకుపోయారు : హరీశ్ రావు - BRS MLA Harish Rao Comments - BRS MLA HARISH RAO COMMENTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-08-2024/640-480-22294719-thumbnail-16x9-hareesh.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 25, 2024, 10:13 PM IST
BRS MLA Harish Rao Comments On Revanth Reddy : కేసీఆర్ హయాంలో సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా అభివృద్ధి లేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటకు వచ్చిన వెటర్నరీ కళాశాలను సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు గద్దలా తన్నుకుపోయారని విమర్శించారు. సిద్దిపేట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. సీఎం కావాలంటే కొత్త వెటర్నరీ కళాశాలను మంజూరు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 251 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను హరీశ్ రావు అందజేశారు. అంతకు ముందు పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా రోడ్డులో ఏర్పాటు చేసిన కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని హరీశ్ రావు ఆవిష్కరించారు. సిద్దిపేటకు రావలసిన నిధులు రాకుండా ఉంటే, తాను ఊరుకుంటానా, అసెంబ్లీలో కొట్లాడి తీసుకొస్తానని హరీశ్ రావు తెలిపారు.