thumbnail

డైరెక్ట్​గా సీఎం కావడంతో రేవంత్​రెడ్డికి సరైన అవగాహన లేదు : ఏలేటి మహేశ్వర్​రెడ్డి - BJP MLA Alleti on Budget

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 4:28 PM IST

MLA Alleti Maheshwar Reddy on Union Budget : అసెంబ్లీలో మ్యాచ్​ ఫిక్సింగ్​ నడుస్తోందని, తమను విస్మరిస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్​ కేటాయింపులపై మంత్రి శ్రీధర్​బాబు మాటలు సరికాదని, రూ.4 వేల కోట్ల నిధులు సీఎం సొంత నియోజకవర్గానికి కేటాయించారని తెలిపారు. కేంద్ర బడ్జెట్​ కేటాయింపుల్లో రాష్ట్రాల ప్రాధాన్యత ఉండదని, ఫెడరల్ స్ట్రక్చర్​లో భాగంగానే నిధుల కేటాయింపులు చేస్తారని పేర్కొన్నారు. డైరెక్ట్​గా సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. 

ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ఆ రాష్ట్ర ప్రస్తుత, గత ముఖ్యమంత్రులు కోరారని ఏలేటి మహేశ్వర్​రెడ్డి తెలిపారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన కేటాయింపులపై చర్చ జరగాలని డిమాండ్​ చేశారు. కొడంగల్​కు వేల కోట్ల నిధులు కేటాయించినప్పుడు, మిగతా జిల్లాల వారు చర్చకు డిమాండ్ చేస్తే దానికి ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పదేళ్లలో రూ.9 లక్షల కోట్ల నిధులు ఇచ్చారని, ఇప్పుడు రూ.80 వేల కోట్ల ఆన్​గోయింగ్ ప్రాజెక్టులు నడుస్తున్నాయని చెప్పారు. దీనిపై చర్చించాలని డిమాండ్​ చేశారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి బానిసగా మారుతున్నారని ఎద్దేవా చేశారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.