thumbnail

మిర్చి కోతలకు వెళ్తున్న ఆటో బోల్తా - 15 మందికి గాయాలు - Auto Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 5, 2024, 11:55 AM IST

Auto Accident in Anantapur District : వ్యవసాయ పనులకు కూలీలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఉరవకొండ మండలం బూదగవి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా విడపనకల్లు మండలం మాళపురం గ్రామానికి చెందిన వారిని స్థానికులు తెలిపారు.

Auto Overturned at Boodagavi : విడపనకల్లు మండలం మాళపురం నుంచి ఉరవకొండ మండలం ఇంద్రావతికి మిర్చి కోత పనికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న ఆటోకు గొర్రెలు అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు కూలీలు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్నారు. గాయాలు అయిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.