మంత్రాలయంలో విదేశీ భక్తుల సందడి
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 26, 2024, 3:45 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/640-480-20844106-thumbnail-16x9-american-german-devotees-in-mantralayam-kurnool.jpg)
American, German Devotees in Mantralayam Kurnool : మంత్రాలయ క్షేత్రంలో విదేశీ భక్తులు సందడి చేశారు. అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన 24 మంది మహిళలు రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. సాంప్రదాయ వస్త్రాలు (Traditional clothes) ధరించి భక్తి శ్రద్ధలతో గ్రామదేవత మంచాలమ్మ వద్ద పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామిని దర్శించుకుని ఊంజల సేవలో పాల్గొన్నారు. ఆదివారం రోజున శ్రీశైలం (Srisailam) వెళ్లి వచ్చామని శివరాత్రికి పెనుగొండకు వెళ్లనున్నట్లు విదేశీ మహిళలు తెలిపారు.
Abroad Devotees In AP Temples : దేశవిదేశాల నుంచి వచ్చి మన విశ్వాసాలపై ప్రగాఢ నమ్మకంతో దేవతా మూర్తుల సేవలో పాల్గొనడం పట్ల పలువురు స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. శివరాత్రి సందర్భంగా వారు పెనుగొండ వెళ్లాలని సంకల్పించుకోవడం సంతోషకరమని (Happy) తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చిన విదేశీ వనితలు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చి దైవ దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వీరితో ఫొటోలు దిగేందుకు స్థానిక భక్తులు ఆసక్తి చూపారు.